in ,

బొందిమడుగుల గ్రామంలో జగనన్న కాలనీ పేరుతో 18 లక్షలు స్వాహా

బొందిమడుగుల గ్రామంలో జగనన్న కాలనీ పేరుతో 18 లక్షలు స్వాహా

బొందిమడుగుల గ్రామ ప్రజలు కర్నూలు జిల్లా కలెక్టర్ గారిని కలిసి జగనన్న కాలనీ పేరుతో 18 లక్షలు థర్డ్ పార్టీకి మళ్లించి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగ పరిచి నేరపూరితమైన కుట్రకు పాల్పడిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకొని  అక్రమంగా దుర్వినియోగపరిచిన నిధులను రికవరీ చేయాలని ఫిర్యాదు చేయడంతో.

కలెక్టర్ హౌసింగ్ పీడీ ఆదేశాల మేరకు హౌసింగ్ ఈ ఈ,డి ఈ బొందిమడుగుల గ్రామానికి వచ్చి జగనన్న  కాలనీ పరిశీలించి కాలనీలో రోడ్లు వేయకున్న త్రాగునీటి పైప్లైన్ వెయకున్న విద్యుత్ సౌకర్యం కల్పించకున్న పచ్చ తోరణం స్కీం కింద మొక్కలు నాటుకున్న నాటినట్లు రికార్డ్ చేసి జగనన్న కాలనీకి మౌలిక వసతులు కల్పించినట్లు ఉద్దేశపూర్వకంగా అధికారులు థర్డ్ పార్టీకి 18 లక్షల రూపాయలు ప్రభుత్వానిధులు మళ్లించి నేరపూరితమైన కుట్రకు పాల్పడ్డారు

తద్వారా జగనన్న కాలనీలో ఇల్లు కట్టుకోవడానికి పనికిరాదు అని జగనన్న కాలనీ నీ అధికారులు రద్దు పరిచారు

ఈ విషయంపై హౌసింగ్ ఈ ఈ గారు విచారణ చేపట్టి జగనన్న కాలనీ పేరుతో ఎలాంటి మౌలిక వసతులు కల్పించకుండానే అధికారులు నిధులు మళ్ళించారు అనంతరం 13 మంది లబ్ధిదారులకు ఇచ్చిన పట్టాలు రద్దు చేశారు ఇల్లు నిర్మించుకోవడానికి జగనన్న కాలనీ పనికిరాదు అని రద్దు చేసి అవినీతికి ఉద్దేశపూర్వకంగా పాల్పడ్డారు నివేదికలు కలెక్టర్ గారికి పంపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలపడమైనది. ఈ కార్యక్రమంలో బొందిమడుగుల గ్రామ ప్రజలు ఎమ్మార్పీఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందిమడుగుల టిఎం రమేష్ మాదిగ వైస్సార్ యువసేన నాయకులు వడ్డే రంగస్వామి, మద్దిలేటి  రాజశేఖర్, ఏసోబు పాండు  తదితరులు పాల్గొన్నారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by G.Raju

డీఎస్సీ 20 వేలు పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వాలి…ఎస్టీయూ

క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు యూత్ ఐ కాన్ మనోజ్ రెడ్డి బహుమతులు