ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా లక్ష్మీనారాయణ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్సై లక్ష్మీనారాయణ మాట్లాడుతూ….… ఆదోని వన్ టౌన్ పట్టణ పరిధిలో ఉన్న శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని ఆదోని పట్టణంలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. జూదం, అక్రమ మద్యం తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. పాత్రికేయులు మరియు పోలీసు సిబ్బంది నూతనముగా ఎస్సై లక్ష్మీనారాయణ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
This post was created with our nice and easy submission form. Create your post!