*జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలు జరుపుకున్న ఆర్.పి.ఎస్.ఎఫ్ నాయకులు*
మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆదోని పట్టణంలోని స్థానిక గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన రాయలసీమ పరిరక్షణ స్టూడెంట్ ఫెడరేషన్(RPSF)నాయకులు.అనంతరం ఆర్.పి.ఎస్.ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నవీన్ కుమార్, జిల్లా కార్యదర్శి బాలు మాట్లాడుతూ శాంతి, సామరస్యం, సత్యం,అహింస ఆయుధాలుగా ఆదర్శవంతమైన జీవనాన్ని గడిపి ఎంతోమంది భారతీయులకు స్ఫూర్తిగా నిలిచారన్నారు.వారు బోధించిన బోధనలు ఈరోజుకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలకు, పాలకులకు నిత్యం సన్మార్గాన్ని చూపిస్తూనే ఉన్నాయి అని అన్నారు. గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం కోసం పాలకులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి హరికృష్ణ, డివిజన్ నాయకులు సూర్య ప్రకాష్, వీరేశ్,వంశీ పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!