*ఆదోని మాతా శిశు ఆసుపత్రి ఉపరితలం పై ప్రహరీ గోడను నిర్మించండి*
రాయలసీమ పరిరక్షణ స్టూడెంట్ ఫెడరేషన్ (RPSF) ఆధ్వర్యంలో ఆదోని పట్టణంలోని మాతా శిశు ఆసుపత్రి ఉపరితలంపై కనీస ఐదు అడుగుల ప్రహరీ గోడను లేదా కంచెను ఏర్పాటు చేయాలని సూపరిడెంట్ మాధవిలత గారికి మరియు అక్కడ ఉండే థీయేటర్ అసిస్టెంట్ చంద్ర గారికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో భాగంగా రాయలసీమ పరిరక్షణ స్టూడెంట్ ఫెడరేషన్(RPSF) రాష్ట్ర ఉపాధ్యక్షుడు నవీన్ కుమార్ మాట్లాడుతూ మాతా శిశు ఆసుపత్రిలో ఉపరితలం పై ఉండే పిల్లల వార్డు మరియు పేషెంట్ వార్డు మధ్యలో ఉండే ఖాళీ స్థలంలో రోగులు బయట తిరిగెటప్పుడు భయాందోళనకు గురవుతున్నారని కావున పేషంట్ ల సమస్యలను దృష్టిలో ఉంచుకొని సమస్యను పరిష్కరించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్.పి.ఎస్.ఎఫ్ జిల్లా కార్యదర్శి బాలు, డివిజన్ అధ్యక్షుడు ప్రదీప్, గిడ్డయ్య జాన్ తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!