ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం గరిష్ట పత్తి ధర క్వింటా రూ.7, 700 పలికింది. గురువారం కంటే పత్తి ధర రూ. 38 తగ్గడంతో రైతులు విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మార్కెట్లో క్వింటా పత్తి కనిష్ట ధర రూ. 5, 199, మధ్య ధర రూ. 7, 459 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. శనివారం మార్కెట్కు 556 (7459 క్వింటాళ్లు) లాట్స్ పత్తి వచ్చినట్లు అధికారులు తెలిపారు.
This post was created with our nice and easy submission form. Create your post!