మరో 24 గంటల్లోనే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. వీటి ప్రభావంతో మూడు రోజుల పాటు కోస్తాలో రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడతాయని ఐఎండీ ప్రకటించింది. ఆవర్తన ప్రభావంతో వాయువ్య బంగాళాఖాతంలో రేపటికి అల్పపీడనం ఏర్పడుతుందని ప్రకటించింది భారత వాతావరణం శాఖ.


