in , ,

చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి సస్పెండ్‌

Chandrababu: 

అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్‌) పి.శ్రీనివాస్‌ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు..

సర్వీసు నిబంధనలు అతిక్రమించి ఉన్నతాధికారులకు తెలపకుండా ఆయన అమెరికా వెళ్లారని ఆదేశాల్లో పేర్కొన్నారు. దీని కారణంగా ఆయన పరారీలో ఉన్నట్లు భావిస్తూ.. చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ప్రస్తుతం సచివాలయంలోని ప్రణాళికా విభాగంలో అసిస్టెంట్‌ సెక్రటరీగా శ్రీనివాస్‌ ఉన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో శ్రీనివాస్‌ను కూడా సీఐడీ నిందితుడిగా చేర్చింది..

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by Allagadda CM news

గుంటూరు వైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలం

క్రెడిట్ కార్డు వాడే ప్రజలు జర భద్రం:ప్రకాశం జిల్లా ఎస్పీ