in , , ,

ఏపీ సీఐడీ చీఫ్పై ఎంపీ ఫిర్యాదు”

కేంద్ర హెూంమంత్రి అమితాకుఆధారాలతో లేఖ

      ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ సర్వీస్ రూల్స్ అతిక్రమించి వైసీపీ తొత్తుగా పనిచేస్తున్నారని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. ఈమేరకు ఆయన గురువారం కేంద్ర హెూంమంత్రి అమితాకు ఒక లేఖ రాశారు. రాజకీయ పక్షపాతాలు లేకుండా పనిచేయాల్సిన సీఐడీ చీఫ్ అన్నీ ఉల్లంఘించి, అధికార పార్టీ కార్యకర్తగా మారిపోయారని అన్నారు. ఒక అధికారినని మరచి, సీఎం జగన్ మెప్పుకోసం ప్రతిపక్షాలపై బురద చల్లుతున్నారని ఆరోపించారు.

విచారణ లేకుండా స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట చేశారనీ, సర్వీసు నిబంధనలకు వ్యతిరేకంగా, దేశమంతా తిరిగి ప్రెస్ మీట్లు పెడుతున్నారని చెప్పారు. ఇలా ప్రెస్ మీట్లు పెట్టి ఆరోపణలు చేయడంతీవ్రమైననేరమనీ, గోప్యంగా ఉంచాల్సిన దర్యాప్తు అంశాలు, మీడియాకు విడుదల చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. కేంద్ర హెూంమంత్రి అమిత్ షాకు ఆధారాలతో లేఖ పంపిన ఎంపీ రామ్మోహన్ నాయుడు.. తక్షణం అతనిపై చర్యలు తీసుకోవాలంటూ కోరారు

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by Prasad

.45 సంత్సరాలు కిడ్నీ వ్యాధి తో బాధపడుతున్న “

ద్వారకాతిరుమలపేకాట శిబిరాలు పై దాడి