in ,

పది ఫలితాల్లో భాష్యం స్కూల్ విద్యార్థుని ప్రభంజనం.

పది ఫలితాల్లో భాష్యం స్కూల్ విద్యార్థుని ప్రభంజనం.

*594 మార్కులతో టాపర్గా నిలిచిన ఎన్. సాహితి*

ఎమ్మిగనూరు న్యూస్ :- పట్టణంలోని భాష్యం ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో బుధవారం ప్రకటించిన 10వ తరగతి ఫలితాల్లో విద్యార్థులు ప్రభంజనాన్ని సృష్టించి తమకు తామే సాటి అని మరోసారి నిరూపించుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాచాని కవిత మాట్లాడుతూ స్కూల్లో ఎన్.సాహితి 594 మార్కులు సాధించి టాపర్గా నిలిచిందని, అలాగే తనుశ్రీ 589, నరేంద్ర 586, ఆఫ్రీన్ 585, జాహ్నవి 585, ఉషశ్రీ 585, ప్రీతి 584, కీర్తిరెడ్డి 584, నందీశ్వర 581 మార్కులు సాధించారని తెలిపారు. అలాగే 580 మార్కులకు పైగా 9 మంది, 570 మార్కులకు పైగా 20 మంది, 550 మందికి పైగా 50 మంది మార్కులు సాధించి తమ సత్తా చాటుకున్నారని చెప్పారు. మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను అభినందించారు. అలాగే గత సంవత్సరం భాష్యం స్కూల్లో చదవిన 10వ తరగతి విద్యార్థులు ప్రస్తుతం వివిధ కాలేజీల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీలలో చదువుతూ అక్కడ కూడ ప్రభంజనాలను సృష్టించటం చాల సంతోషంగా ఉందని తెలిపారు. అనంతరం కాలేజీ అవరణలో బాణ సంచా కాల్చి సంబరాలు జరుపుకొని విద్యార్థులకు స్వీట్లను తినిపించారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by G.Raju

*విద్యుత్తు సరఫరాలో అంతరాయం *

అదోనిలో 60 లక్షల బంగారు స్వాధీనం..