in ,

ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోండి.

ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలి*

*ఆదోని శాసనసభ్యులు డాక్టర్ పార్థసారధి గారు.:-*

*ఆదోని/జూన్ 18*

     *ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆదోని శాసనసభ్యులు డాక్టర్ పార్థసారధి పేర్కొన్నారు. గురువారం ఆదోని పట్టణం ఆర్ఆర్ లేబర్ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు,బ్యాగ్, షూస్, యూనిఫామ్, అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారు మాట్లాడుతూ… ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు. విద్యార్థి దశలోనే భవిష్యత్తు ప్రణాళికను సిద్ధం చేసుకుని ఉన్నత చదువులు చదువుకొని లక్ష్యాన్ని సాధించాలని కోరారు. అనంతరం పదవ తరగతిలో  అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు షీల్డ్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ, ప్రధానోపాధ్యాయులు రమేష్ నాయుడు, మల్లికార్జున, కల్లేబావి రాజు,మునిస్వామి, నాగరాజుగౌడ్, వీరభద్ర, నక్కల రాజు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by G.Raju

NEWSతెల్లరేషన్‌ కార్డుకు బియ్యంతోపాటు పంచదార, కందిపప్పు

నూతన ప్రభుత్వం ఉపాధ్యాయులు సమస్యలు పరిష్కారంకు కృషి చేయాలి…