in , , , ,

కర్నూలు జైలు దగ్గర గుండెలు పిండేసిన ఘటన..

తల్లి కోసం కన్నీరుమున్నీరుగా విలపించిన బిడ్డ!

అమ్మ ఏమి చేసిందో ఆ చిన్నారికి తెలియదు.. బిడ్డను ఓదార్చేందుకు ఆ తల్లికి దారి లేదు… తల్లీబిడ్డల బంధాన్ని జైలు గోడలు దూరం చేశాయి. తల్లి దూరమైందన్న ఆవేదన ఆ ఏడేళ్ల చిన్నారి నుంచి కన్నీటి రూపంలో ఉబికి వస్తోంది. అమ్మను చూడాలని, అమ్మతో మాట్లాడాలని వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆ చిన్నారిని చూసిన వాళ్లందరి కళ్లలో నీళ్లు తిరిగాయి. జైలు గోడకు అటుగా ఉన్న తల్లి కోసం, ఆ జైలు ముందే అమ్మా. అమ్మా.. అంటూ తడారిన గొంతుతో పిలుస్తున్న ఆ చిన్నారి పిలుపు మాత్రం ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. శుక్రవారం కర్నూలు రూరల్ తహసీల్దారు కార్యాలయం ప్రాంగణంలోని మహిళా సబ్ జైలు ఎదుట కనిపించిన దృశ్యమిది.

కర్నూలు పాతనగరానికి చెందిన ఓ మహిళ చోరీ కేసులో పట్టుబడగా పోలీసులు రిమాండ్ కు తరలించారు. ఆమెను మహిళా సబ్ జైలులో ఉంచారు. కానీ తల్లి ఎలాంటి తప్పు చేసిందో ఆ చిన్నారికి తెలియదు. ఆమె చేసిన నేరం గురించి ఆలోచించే వయస్సు కూడా ఆ బాలికకు లేదు. కేవలం అమ్మ దూరమైందన్న ఆవేదన ఆ చిన్నారిని జైలు వరకు వచ్చేలా చేసింది. తల్లిని చూడాలన్న ఆరాటం జైలు తలుపు తడుతూ ఆవేదనతో అక్కడే ఉండిపోయేలా చేసింది.

స్థానికులు కొంత మంది జైలు అధికారులను విజ్ఞప్తి చేయగా జైలు అధికారులు ఆ తల్లిని మరోసారి బయటకు పిలిపించి కూతురికి చూపించారు. ఆ తర్వాత కూతురును కూడా లోపలికి తీసుకెళ్లింది. అనంతరం జైలు అధికారులు ఆ బిడ్డను వారి బంధువుల ద్వారా ఇంటికి పంపించి వేశారు

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by Allagadda CM news

ఇంటి,కొళాయి గుత్తలేని మహిళలకు జగనన్న చేయూత నిలిపివేస్తామాడం సరిక

చేపను మింగిన నాలుగు నెలల పిల్లవాడు