in ,

వైద్యుల నివాస గృహ నిర్మాణాలు వేగంగా పూర్తి చేయండి ఐటిడి ఏ పిఓ వి. అభిషేక్‌

పాడేరు:   వైద్యాధికారుల నివాస గృహాల‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల‌ని  ఐటిడి ఏ  పి ఓ  వి. అభిషేక్ ఆదేశించారు. రూ.1.కోటి 50 ల‌క్ష‌ల న ఓ జి ఐ ఎ నిధుల‌తో  స్థానిక మ‌లేరియా కార్యాల‌యం స‌మీపంలో  నిర్మిస్తున్న  వైద్యాధికారుల నివాస భ‌వ‌న నిర్మాణ‌పు ప‌నుల‌ను సోమ‌వారం ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ నిర్మాణాల‌లో ప‌టిష్ట‌మైన నాణ్య‌త‌లు పాటించాల‌ని సూచించారు.  ప్ర‌వేశ మార్గం,పార్కింగ్‌, మ‌రుగు దొడ్ల సెప్టిక్ ట్యాంకు నిర్మాణాల‌పై ప‌లు సూచ‌న‌లు చేసారు.   వేగంగా పూర్తి చేసి వినియోగం లోకి తీసుకుని రావాల‌న్నారు.  ఈ కార్య‌క్ర‌మంలో గిరిజ‌న సంక్షేమ శాఖ ఇ ఇ  డి వి ఆర్ ఎం.రాజు, డి. ఇ. అనుదీప్ , ఎ ఇ, దేముళ్లు  త‌దిత‌రులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి

కనిపించని నాలుగో సింహం ఎస్ఐ శ్రీను నాయక్