చాగి గ్రామంలో ఘనంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు
ఆదోని. జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా పాటసాల యందు ప్రధాన ఉపాధ్యాయులు ఆధ్వర్యంలో విధ్యాకమిటి చైర్మన్ టి బసవరాజు మరియు గ్రామ సర్పంచ్ వై రాజశేఖర్ గౌడ్ వార్దు మెంబర్ కె మంగేశ్.మరియు పొదుపు విఒఎ మల్లేశ్వరి, ఉపాధ్యాయురాలు సోబరాణి జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలకు పిల్లలు తల్లి దండ్రులకు మరియు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ…..భిన్నత్వంలో ఏకత్వం మన దేశ ఔనత్వం సదా దీనిని కాపాడుకోవడం భారతీయులు గా మన కర్తవ్యం అని తెలియజేస్తూ మరోసారి దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వై రాజశేఖర్ గౌడ్ యం బసయ్య స్వామి కె మంగేశ్ ఉపాధ్యాయురాలు సోబరాణి,నేత్రావతి , విఒఎ మల్లేశ్వరి గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!