in ,

గణేష్ నిమజ్జనంలో విషాదం……

డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా

_వినాయక విగ్రహ నిమజ్జనానికి వెళ్లి ఒక విద్యార్థి గల్లంతైన ఘటన బుధవారం ఆలమూరు మండలంలోని మడికి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలియజేసిన వివరాలు ప్రకారం అదే గ్రామానికి చెందిన అత్తిలి రాకేష్ (22) సూరంపాలెంలో ఉన్న ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మడికి మార్కెట్ వద్ద ఏర్పాటుచేసిన వినాయకుని నిమజ్జనంలో భాగంగా ఊరేగింపు పూర్తి చేశారు. జాతీయ రహదారి చెంతన ఉన్న ప్రధాన కాలువ వద్ద స్థానికులతో రాకేష్ కలిసి నిమజ్జనంలో పాల్గొన్నాడు.అనంతరం స్నేహితులతో ఈతకొట్టే తరుణంలో రాకేష్ గల్లంతైనట్లు వారు తెలిపారు. స్థానిక పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకోగా మార్కెట్ కమిటీ చైర్మన్ యనమదుల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందంతో గాలింపు చర్యలు చేపట్టారు._

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by Kiran

Flipkart Big Billion Days Sale | ఫ్లిప్‌కార్డ్‌ బిగ్‌ బిలియన్‌

హార్బర్ పనులు పునః ప్రారంబించాలి : కారే